పాతాలబైరవిఈ యేడాది అత్యధికంగా 23 చిత్రాలు విడుదలయ్యాయి.
'విజయా' వారి పర్వం ఈ సంవత్సరంతోనే ఆరంభం.
అప్పటి అగ్రహీరో అక్కినేని ఐదు జానపద చిత్రాలలో నటించారు.
విజయావారి 'పాతాళభైరవి' అత్యద్భుత విజయం సాధించి, తెలుగు సినిమా వసూళ్ళ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచింది. మొదటి బ్యాచ్లో 13 ప్రింట్లతో ఈ చిత్రం విడుదలై, తొలిసారిగా 10 కేంద్రాలలో శతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని ద్విశతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. భారీ ఖర్చుతో కళాత్మక, సాంకేతిక విలువల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా నిర్మాణ సరళినే మార్చివేసింది.హీరో పాత్రలకు అతీంద్రియా శక్తులను ఆపాదించి చూపించడం ఈ చిత్రంతోనే ఆరంభమైంది.
భానుమతి, యన్టీఆర్తో బి.యన్.రెడ్డి రూపొందించిన 'మల్లీశ్వరి' దేశవిదేశాల్లో కళాప్రియుల ప్రశంసలు అందుకుంది. నేటీకీ తెలుగు సినిమా కళాఖండాలలో ఈ చిత్రం అగ్రతాంబూలం అందుకుంటూనే ఉంది. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.