కింజరాపు అచ్చెన్నాయుడు

వికీపీడియా నుండి
(కింజరాపు అచ్చంనాయుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కింజరాపు అచ్చంనాయుడు
కింజరాపు అచ్చెన్నాయుడు

కింజరాపు అచ్చంనాయుడు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
టెక్కలి శాసనసభ నియోజకవర్గం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2014 - ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
1996 – 2009
ముందు మజ్జి నారాయణరావు
తరువాత పిరియా సాయిరాజ్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1971-03-26) 1971 మార్చి 26 (వయసు 53)
టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు దాలినాయుడు (తండ్రి)
జీవిత భాగస్వామి విజయమాధవి
బంధువులు కింజరాపు ఎర్రన్నాయుడు (సోదరుడు)
రామ్మోహన్‌ నాయుడు (సోదరుని కుమారుడు)
సంతానం కృష్ణ మోహన్‌ నాయుడు , తనూజ
నివాసం నిమ్మాడ గ్రామం శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి కృష్ణా కళాశాల, విశాఖపట్నం
వృత్తి రాజకీయము , వ్యవసాయము
మతం హిందూ

కింజరాపు అచ్చంనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభ్యుడు. ఆయన 2014 నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా వున్నాడు.[1] ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన మార్చి 26 1971టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం లో జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు. ఆయన కృష్ణా కళాశాల, విశాఖపట్నంలో బి.యస్సీ చదివారు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు యర్రంనాయుడు. అచ్చంనాయుడు హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మూడుసార్లు ఎం.ఎల్.ఎగా ఎన్నికైనారు. ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గానికి మారారు. ఆయన 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కె.రేవతీపతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009లో రేవతీపతి ఆకశ్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన మరల రేవతీపతి భార్య అయిన కె.భారతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు.[2] 2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో గల ఏడు శాసన సభ నియోజకవర్గాలలో ఒక్క పాతపట్నం శాసన సభ నియోజకవర్గం తప్ప అన్నింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలుపుటకు కృషిచేసిన అచ్చన్నాయుడును రాష్ట్ర కేబినెట్ లో కార్మిక శాఖను అప్పగించారు.[3]

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరార తిలక్ పై విజయం సాధించాడు.[4]

ఎన్నికలలో పోటీ

[మార్చు]

అచ్చెన్నాయుడు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన 1999లో రెండోసారి, 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ పునర్విభజన తర్వాత టెక్కలి నియోజకవర్గం నుండి 2014, 2019, 2024లో వరుసగా మూడుసార్లు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 19 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో కార్మికశాఖ, క్రీడలు, యువజనశాఖ, వెనుకబడిన తరగతులు సంక్షేమం, జౌళి శాఖ మంత్రిగా పని చేసి,[5] 2024 జూన్ 12 నుండి చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ, పశుసంవర్థకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "List of candidates for Tekkali Constituency 2014". Archived from the original on 2016-05-23. Retrieved 2016-05-18.
  2. "అచ్చన్నాయుడు బయాగ్రఫీ". Archived from the original on 2016-08-27. Retrieved 2016-05-18.
  3. Kinjarapu family shows strength as Atchannaidu visits Srikakulam
  4. "AP Assembly Winners 2019 List: ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. జిల్లాలవారీగా విజేతల వివరాలు". Samayam Telugu. 2019-05-23. Retrieved 2019-07-21.
  5. Zee News (11 June 2014). "AP CM Naidu allocates berths, keeps Energy, Industry & Tourism" (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
  6. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.

ఇతర లింకులు

[మార్చు]