గోవా పీపుల్స్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోవా పీపుల్స్ కాంగ్రెస్ అనేది గోవాలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చీలిక సమూహం. కాంగ్రెస్ పార్టీ నుండి 2000లో ఫ్రాన్సిస్కో సార్డిన్హా నాయకత్వంలో గోవా పీపుల్స్ కాంగ్రెస్ విడిపోయింది.[1][2]

గోవా పీపుల్స్ కాంగ్రెస్ సార్దిన్హా ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం తొమ్మిది నెలలు కొనసాగింది. గోవా పీపుల్స్ కాంగ్రెస్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత, ఇతర కాంగ్రెస్ అసమ్మతివాదుల మద్దతుతో బిజెపి పాలన కొనసాగించింది. సర్దిన్హా మంత్రివర్గం పతనం తర్వాత దయానంద్ నార్వేకర్ నేతృత్వంలోని శాసనసభలోని ఇద్దరు గోవా పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులు విడిపోయి సమాంతర గోవా పీపుల్స్ కాంగ్రెస్ ని ఏర్పాటు చేశారు.[3]

సర్దిన్హా గోవా పీపుల్స్ కాంగ్రెస్ 2001 ఏప్రిల్ 5న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం చేయబడింది. నార్వేకర్ గోవా పీపుల్స్ కాంగ్రెస్ అదే సంవత్సరం ఆగస్టు 27న కాంగ్రెస్ తో విలీనమైంది.

మూలాలు

[మార్చు]