రాముడు సీత, లక్ష్మణులతో కలిసి ప్రయాణంరామాయణం లో రాముడు సీతాలక్ష్మణసమేతుడై అయోధ్య నుండి బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని యైదవనాడు చిత్రకూటము జేరి యందు పండ్రెండేండ్లు నివసించి పదమూడవ సంవత్సరమున పంచవటియందు కాముకురాలగు శూర్పణఖను విరూపను గావించెను. పిదప జ్యేష్ఠ కృష్ణాష్టమి నాడు రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై రామ రామ యని యేడ్చెను. ఆ యేడుపువిని జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను.[1]