జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం
పూర్వపు నామము | నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజీ |
---|---|
ఆంగ్లంలో నినాదం | గేట్వే టు ఎక్సలెన్స్ |
రకం | పబ్లిక్ యూనివర్సిటీ |
స్థాపితం | 1972 |
విద్యాసంబంధ అనుబంధం | యూజీసీ |
ఛాన్సలర్ | జిష్ణుదేవ్ వర్మ (తెలంగాణ గవర్నర్) |
వైస్ ఛాన్సలర్ | - టి.కిషన్ కుమార్ రెడ్డి - ఉపకులపతి |
స్థానం | కూకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం 17°29′34″N 78°24′19″E / 17.492680°N 78.405390°E |
భాష | English |
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జె ఎన్ టి యు అనగా Jawaharlal Nehru Technological University (J.N.T.U), తెలంగాణ రాజధాని హైదరాబాదులో గల ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే దేశంలో మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా 1972 అక్టోబర్ నెల 2వ తేదీన స్థాపించబడింది. తరువాత ఆగస్టు 18 నాటి 2008 ఆంధ్రప్రదేశ్ శాసనసభ 31 చట్టం మేరకు సెప్టెంబరు 2008 లో నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పునర్వ్యవస్థీకరించబడింది.
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపూర్
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
- జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
[మార్చు]ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
- 1.కట్టా నర్సింహారెడ్డి - 21మే 2021 నుండి 20 మే 2024[1][2]
విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన బుర్రా వెంకటేశం ఇన్ ఛార్జి వీసీ గా పని చేశాడు.ప్రభుత్వం అతనిని టీజీ పీఎస్సీ చైర్మన్ గా నియమించడంతో ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు బాల కిష్టారెడ్డిని నియమించింది.
- 3వి.బాలకిష్టా రెడ్డి (06 డిసెంబర్ 2024 నుండి 17 ఫిబ్రవరి 2025 వరకు)
జేఎన్టీయూ హెచ్ ఇన్ ఛార్జి వీసీ గా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నియమితులయ్యాడు. అక్టోబర్/2024లో సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించి గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ఆమోదంతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జీవో జారీ చేశారు.
- 4.టి.కిషన్ కుమార్ రెడ్డి(18 ఫిబ్రవరి 2025 నుండి )
జే ఎన్ టీయూ ఉపకులపతిగా ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవీ లో కొనసాగుతారు.సేర్చ కమిటీ సిఫార్సు చేసిన వారిలో కిషన్ కుమార్ రెడ్డి పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా నియామక ఉత్తర్వులు 13 ఫిబ్రవరి 2025న జారీ చేశారు.ఈ మేరకు 18 ఫిబ్రవరి 2025 న ఆయన బాధ్యతలు స్వీకరించారు[3].
ఇతర వివరాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో మెట్రో స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Prabha News (23 May 2021). "తెలంగాణలో యూనివర్సిటీలకు కొత్త వీసీలు". Prabha News. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
- ↑ Telangana Today (20 May 2024). "Tenure of nine V-Cs to end today" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
- ↑ ABN (2025-02-19). "JNTU: జేఎన్టీయూ వీసీగా కిషన్కుమార్రెడ్డి". Andhrajyothy Telugu News. Retrieved 2025-02-19.
బయటి లింకులు
[మార్చు]
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ Archived 2021-04-11 at the Wayback Machine
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం,కాకివాడ Archived 2021-02-26 at the Wayback Machine
- జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం , హైదరాబాదు
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం