2025 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్లో 2025 ఎన్నికలలో రాష్ట్రంలోని శాసనమండలి, పంచాయతీలకు, పట్టణ స్థానిక సంస్థలకు జరగవలసిన ఎన్నికల వివరాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి.
ఫిబ్రవరి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు ఉభయగోదావరి జిల్లాలు & కృష్ణా, గుంటూరు స్థానాలకు, ఉపాధ్యాయ నియోజకవర్గం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గ స్థానానికి ఫిబ్రవరి 3న ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.[1] ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.[2][3]
ఈవెంట్ | తేదీ |
నోటిఫికేషన్ తేదీ | 2025 ఫిబ్రవరి 3 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 2025 ఫిబ్రవరి 10 |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2025 ఫిబ్రవరి 11 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 2025 ఫిబ్రవరి 13 |
ఎన్నికల తేదీ | 2025 ఫిబ్రవరి 27 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2025 మార్చి 3 |
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ | 2025 మార్చి 8 |
ఎన్నికైన అభ్యర్థులు
[మార్చు]పేరు | పార్టీ | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | గమనికలు | |
---|---|---|---|---|---|
గాదె శ్రీనివాసులు నాయుడు | పీఆర్టీయూ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక | |
పేరాబత్తుల రాజశేఖరం | టీడీపీ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నిక | |
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ | టీడీపీ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక |
మార్చి
[మార్చు]రాష్ట్రంలోని 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ఫిబ్రవరి 24న ప్రకటించింది.[4] ఆంధ్రప్రదేశ్లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది.[5][6]
ఈవెంట్ | తేదీ |
నోటిఫికేషన్ తేదీ | 2025 మార్చి 3 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 2025 మార్చి 10 |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2025 మార్చి 11 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 2025 మార్చి 13 |
ఎన్నికల తేదీ | 2025 మార్చి 20 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2025 మార్చి 20 |
ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ | 2025 మార్చి 24 |
ఈ ఎన్నికలలో 5 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఐదుగురు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో వారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనిత రాణి ప్రకటించింది.[7]
ఎన్నికైన అభ్యర్థులు
[మార్చు]పేరు | పార్టీ | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | గమనికలు | |
---|---|---|---|---|---|
బెందుల తిరుమల నాయుడు | టీడీపీ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక | |
బీద రవిచంద్ర యాదవ్ | టీడీపీ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక | |
కావలి గ్రీష్మ | టీడీపీ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నిక | |
కొణిదెల నాగేంద్రబాబు | జేఎన్పీ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నిక | |
సోము వీర్రాజు | బీజేపీ | 2025 మార్చి 30 | 2031 మార్చి 29 | రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక |
మూలాలు
[మార్చు]- ↑ "ఓటెత్తిన పట్టభద్రులు". Eenadu. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల". Eenadu. 29 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న". Eenadu. 31 January 2025. Archived from the original on 31 January 2025. Retrieved 25 February 2025.
- ↑ "తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్". Eenadu. 24 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "మండలి.. మరో నగారా". Eenadu. 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, ఒకటి జనసేనకు ఫిక్స్- కూటమి నుంచి రేసులో ఉన్నది వీరే!". 25 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే". Eenadu. 13 March 2025. Archived from the original on 13 March 2025. Retrieved 13 March 2025.