శ్రీకృష్ణ శతానందీయము (పుస్తకం)
Jump to navigation
Jump to search
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
- ఈ గ్రంథం గురించి
లక్ష్మణ రాయ పరిశోధక మండలి నిమిత్తం ఆనాడు తెలంగాణంలో సేకరించిన తాళ పత్ర గ్రంథాలలో నల్లగొండ జిల్లా, కనగల్లు గ్రామ వాసులైన ఆసూరి మరింగంటి శ్రీరంగాచార్యుల వారి యింట లభించిన తాటాకు పుస్తకాలలో ఇది యొకటి. తదనంతరము లక్ష్మణరాయ పరిశోధక మండలి రద్దయి దానిలోని గ్రంథాలు తస్కరలకు పోగా మిగిలినవి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారానికి చేరినవి. వాటిలో
శ్రీకృష్ణశతానందీయము ఒకటి. దీనిని శ్రీ రంగయ్య స్వహస్తంగా వ్రాసుకున్నది. దీనిని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయము, హైదరాబాదు వారు ప్రచురించారు. ఇందులోని విషయము పురాణ గాథ. ఇది పద్య గద్య సహిత గ్రంథము.