Jump to content

శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్

వికీపీడియా నుండి
శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్
Srikanta Datta Narasimharaja Wadiyar, Scion of Mysore Royal Family
పూర్వాధికారిజయచామరాజేంద్ర ఒడయార్
జననం(1953-02-20)1953 ఫిబ్రవరి 20
మైసూర్, భారతదేశం
మరణం10 డిసెంబరు 2013(2013-12-10) (aged 60)
బెంగలూరు, కర్ణాటక, భారతదేశం
Spouseప్రమోదా దేవి
Houseఒడయార్
తండ్రిజయచామరాజేంద్ర ఒడయార్
తల్లిత్రిపుర సుందరి అమ్మణి
మతంహిందూ
Signatureశ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్'s signature

శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ మైసూర్ సంస్థానం చివరి రాజు జయచామ రాజేంద్ర ఒడయార్ ఏకైక కుమారుడు. ఇతడు మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన యదు వంశ రాజులలో చివరివాడు.

నేపథ్యం

[మార్చు]

1953 ఫిబ్రవరి 20న ఒడయార్ మైసూరులో జన్మించాడు. అక్కడే మహారాజ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ, శారదా విలాస్ న్యాయ కళాశాలలో ఎల్‌.ఎల్‌.బీ. పూర్తి చేశాడు. 1973లో ప్రైవేట్ రాజ దర్బారులో పట్టాభిషేకం జరిగింది. 1976 ఫిబ్రవరి 2న ప్రమోదా దేవిని వివాహమాడాడు. 1984, 1989, 1996, 1999లలో మైసూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

బయటి లంకెలు

[మార్చు]