వి.రాజారామమోహనరావు ప్రముఖ రచయిత, అనువాదకుడు, సాహితీవిమర్శకుడు. పలు పత్రికల్లో అసంఖ్యాకమైన ముద్రిత రచనలు, ఎన్నో బహుమతులు పొందిన ఆయన తెలుగు సాహిత్యంలో తనదైన స్థానాన్ని సాధించుకుంటున్నారు. కథారచయిత, విమర్శకునిగానే కాక తెలుగు సినీవిమర్శలో కూడా తనదైన ముద్రవేశారు ఆయన.
1948 సం.లో రాజమండ్రి లో జన్మించారు.
వీరి స్వస్థలం ఏలూరు.(ప.గో.జి)
ఏడవ తరగతి వరకు పాఠశాలలకు వెళ్ళలేదు.
7 వ తరగతి పెద్దాపురంలో చదివారు.
తరువాత ఇంజనీరింగ్ చేశారు.
సెంట్రల్ రైల్వే నాంపల్లి లో ఉద్యోగిగా పనిచేశారు.gor
రాజారామమోహనరావు విలక్షణమైన కథావస్తువుతో క్లుప్తంగా కథలు, నవలలు రాయడంలో సిద్ధహస్తులు. ఆయన పలు పురస్కారాలు పొంది, నవలల పోటీల్లో, కథల పోటీల్లో విజయాలు సాధించారు. తెలుగు పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువాదం చేశారు. తెలుగులో ప్రఖ్యాతమైన నవలలను పాఠకులకు "నవలా హృదయం" శీర్షికన పరిచయం చేశారు.[1]
జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ పురస్కారం - 1999
పాకాల రామలక్ష్మి పురస్కారం - 2001
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానికా ప్రక్రియ పురస్కారం(తెల్లటి చీకటి కథా సంపుటికి) - 2002
పులికంటి సాహితీ సత్కృతి - 2002
గురజాడ 150 జయంతి స్మారక పురస్కారం(చేదోడు కథకి) - 2012
వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించిన పోటీల్లో కథలకు, నవలలకు ఇరవై సార్లు బహుమతులు పొందారు
పఠనాపరంగా, ప్రయోగపరంగా, ఉద్యమస్ఫూర్తి వల్ల, సృజనాత్మకమైన కొత్త దృక్కోణం వల్ల, రచనాపరమైన నైపుణ్యంతో.... ఇలా రకరకాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ తెలుగు నవలలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రచనల్లో కొన్నింటిని అమెరికాలో వెలువడే తెలుగునాడి మాసపత్రిక కోసం విమర్శనాత్మక పరిచయాలుగా నేను రాశాను. ఆ రచనల సంపుటే ఈ పుస్తకం అంటూ తన నవలాహృదయం గురించి వెల్లడించారు.
సామాజిక భాద్యతలో భాగంగా తాను మంచి కథలు రాస్తూ, ఆ కథల ద్వారా పాఠకుడికి ఓర్పునీ, నేర్పునీ, నేర్పించే శక్తిమంతమైన కలం రాజారామమోహనరావుది. కథావస్తువు. శైలీ, శిల్పం అన్నీ అందంగా అమరిన గొప్ప కథ ’చిరిగిన తెరచాప’. మద్యతరగతి బతుక్కి ధ్వని మంతమైన శీర్షిక! -విహారి