Jump to content

విజయవాణి (వారపత్రిక)

వికీపీడియా నుండి
విజయవాణి
సంపాదకులుమల్లెల శ్రీరామమూర్తి
తరచుదనంవారపత్రిక
మొదటి సంచికజనవరి 14, 1948 (1948-01-14)
దేశంభారతదేశం
కేంద్రస్థానంవిజయవాడ
భాషతెలుగు

విజయవాణి మల్లెల శ్రీరామమూర్తి సంపాదకత్వంలో 1948 జనవరి సంక్రాంతినాడు ప్రారంభమైన తెలుగు వారపత్రిక. పన్నెండు పేజీల ఈ పత్రిక ధర రెండణాలు. విజయవాడ నుండి వెలువడింది. ఈ పత్రిక ప్రతి బుధవారంనాడు విడుదల అయ్యేది. యూనివర్సల్ ప్రింటర్స్‌లో ఈ పత్రిక ముద్రితమైంది.[1]


ఈ పత్రికలో పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, మారేపల్లి రామచంద్ర శాస్త్రి, చెళ్ళపిళ్ళ దుర్గేశ్వరశాస్త్రి, జమ్మలమడక మాధవరామశర్మ, చిలుకూరి నారాయణరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, చిట్టా రామకృష్ణారావు, అల్లంరాజు లక్ష్మీపతి మొదలైనవారి రచనలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. యామిజాల జగదీశ్. "రెండణాల పత్రిక". మొలక. Retrieved 22 February 2025.