వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 32వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదురా ద్వీపం

మదురా ద్వీపం ఇండోనేషియా లోని ఒక ద్వీపం. ఇది జావా ఈశాన్య తీరంలో ఉంది. ఈ ద్వీపం వైశాల్యం సుమారు 4,078.67 చ.కిమీ (పరిపాలనాపరంగా 5,168 కిమీ² తూర్పు, ఉత్తరాన ఉన్న వివిధ చిన్న ద్వీపాలతో సహా) ఉంది. పరిపాలనాపరంగా మదుర తూర్పు జావాలో భాగంగా ఉంది. ఇది ఒక సన్నని జలసంధి ద్వారా జావా నుండి వేరు చేయబడింది. పరిపాలనా విభాగంలో జనసాంద్రత చ.కి.మీ.కు 702 మంది ఉండగా ద్వీపంలో జనసాంద్రత చ.కి.మీ. కి 817. 1964 లో మాతురం సుల్తానేటుకు చెందిన సుల్తాన్ అగుంగు మదురా ద్వీపాన్ని జయించి ఈ ప్రాంతాన్ని కాక్రానింగ్రాట్సు రాచరికపాలన క్రిందకు తీసుకువచ్చాడు. కాక్రానిన్గ్రాటు కుటుంబం జావాకేంద్ర పాలనను వ్యతిరేకిస్తూ అత్యకమైన మాతారాం భాగాలను జయించింది. మూడవ అమంగ్కురాటు, ఆయన మామ పంగేరన్ పుగర్ మధ్య జరిగిన మొదటి జావానీస్ యుద్ధం తరువాత 1705 లో డచ్చి మదురా తూర్పు భాగంలో నియంత్రణ సాధించింది. ప్యూగర్ డచ్చి గుర్తింపు లభించడం పశ్చిమ మదుర ప్రభువు( కాక్రానింగ్రాట్)ని ప్రభావితమైంది. మద్య జావాలో మొదలైన యుద్ధంలో మదురీయులు జోక్యం చేసుకుంటారన్న ఆశతో పశ్చిమ మదుర ప్రభువు పుగర్ వాదనలకు మద్దతు ఇచ్చాడు. అమంగ్కురాటు ఖైదుచేయబడి చేయబడి సిలోనుకు పంపబడిన సమయంలో పుగర్ మొదటి పకుబువోనో అనే బిరుదును స్వీకరించి డచ్తో ఒక ఒప్పందం మీద సంతకం చేసిన ఫలితంగా డచ్చి తూర్పు మదురమీద సాధికారత సాధించింది.
(ఇంకా…)