పాలేరు, ఖమ్మం జిల్లాలో ప్రవహిస్తుంది. ఇది కృష్ణానదికి ఉపనది. దీనిపై నిజాం ప్రభుత్వ కాలంలో ఆనకట్ట నిర్మించి రిజర్వాయరు ఏర్పాటు చేశారు. దీని క్రింద కూసుమంచి మరియు నేలకొండపల్లి మండలాలలో కొన్ని వందల ఎకరాల భూములకు నీటి వసతి కలుగుతున్నది