వాడుకరి:అనిల్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనిల్ అనే వ్యక్తి ఈ వూరినందు జన్మించి త్రిబుల్ ఐటిలో చదువుతూ రాసిన పాటలు ఒక రెండు ఇవ్వబడినవి. ఈ యువకుడు జన్మించినది "ఒంగోలు" కానీ ఉండేది "గుంటూరు". ముందుగా ఇతడి పరిచయం :- పదొవతరగతి వరుకు వేల్పూరు జి.ప.ఉ.ప పాఠశాలలో చదివాడు.ప్రస్తుతం త్రిబుల్ ఐటి నందు రెండవ సంవత్సరము చదువుతున్నాడు.సమాజంపై ఎప్పుడు ఒక కన్నేసి అలోచిస్తుంటాడు.మంచి సమయస్పూర్తికలవాడు.సమాజంలో జరిగే ప్రతిదానికి సానుకూలంగా స్పందిస్తుంటాడు.మంచికధ రచియిత. ఎమైన ఎవ్వరైన ఎప్పుడైన మీరు ఇతడితో స్పందించాలనుకుంటే ఇందులో మీరు ప్రశ్నలు అడిగి మీ సమస్యలను అధిరోహించవచ్చు.

నేపధ్యం :సమాజంలో బాధలకు గురైనటువంటి స్త్రీలు ఒక దేవుని గుడికి వెళ్ళి తన బాధలను దేవతకు మొరపెట్టుకొను సందర్భంలో వచ్చిన నా చిన్ని పాట. 
                       @ పాట 1 @

పల్ల్లవి : ఆడ పిల్లలం తల్లీ మేము ఆడపిల్లలం

          అన్ని వున్నట్టి అనాధలం మేమె ఆడపిల్లలం. 

చరణం :పుట్టగానే అమ్మా అని పిలిచేలోపే పుణ్యలోకాలు చేరేటి పసికందులం.......తల్లీ(పల్లవి)

          కంటకన్న కలలు కన్నీళ్ళు చేసి 
          వయసొచ్చిందంటూ,పుట్టింటోల్లు 
          మెట్టె తొడిగే కాలమిదేనంటూ 
          అత్తోరింటికి తరిమేస్తారూ....తల్లీ 
          నమ్ముకున్న వాడు నరకంబెట్టి 
          ఇవ్వవలసినది ఏదో తేలేదంటూ 
          అత్తమామళ్ళు చివాట్లెట్టి 
          వీధిలోకి లాగి దూచేస్తారు...తల్లీ 
          గప్పటిదాక వున్న నిర్భరాన్ని 
          నలుగురి యెట్టి నలిచేస్తారు....తల్లీ                                        
                                               (పల్లవి) 

చరణం :గరిటబట్టి వంటింట్లోనే లోకంతో పనిలేక బతికేటట్టి

           నిరాశకులం మేమే..అంగడిలో అమ్ముడు బొమ్మలం మేమే....తల్లీ 
           ఆడది గొప్పది అంటూ 
           బయటెన్నో చిలకపలుకులు పలికే వారికింద ఊడిగం చేస్తూ 
           ఆడజన్మనెత్తిన అభాగ్యులం.....తల్లీ                                        
                                               (పల్లవి)

చరణం :పొద్దుపొడవడం ఎంత నిజమో

          అంత గొప్ప బాధలు భరిస్తూ, భూదేవి సహానం చూపిస్తూ 
          లోకానికి ఏకాకులమైనట్టి వారిమి తల్లీ.....
                                               (పల్లవి) 

చరణం :అమ్మ దైవరూపమంటూ

          ఆ అమ్మే ఆడది అంటూ 
          ఆ అమ్మనే అమ్ముకునే లోకంలో బాధితులం ...తల్లీ  
                                                (పల్లవి) 

చరణం :స్త్రీ పురుషులంటూ ఏలా ఈ బేధం

         చీకటి మా బతుకుల్లో వెలుగును నింపే 
         ఆ రోజూ ఎన్నడు వచ్చునో చెప్పవే తల్లీ.....                  (పల్లవి)
                                                                                           
                                          .............జి.అనిల్ కుమార్ ......

నేపధ్యం : దిక్కుమొక్కులేని అనాధలందరు కలసి వాళ్ళ పరిస్థితి గూర్చి వారికి వారే వివరించుకొను సందర్భంలోనిది ఈ పాట.

                     @ పాట 2@

పల్లవి :అనాధలం మేము అనాధలం

        అమ్మ అనే లోపే ఆరుబయట పడినట్టి అనాధలం 
        తల్లి దండ్రి ప్రేమను నోచుకోని అనాధలం. 

చరణం  : కన్నీళ్ళుకడుపు నింపవని

             కష్టమే మార్గం అనుకొంటూ 
             బుడిబుడి అడుగులతో,కష్టంతో 
              బ్రతుకు బండిని ఈడ్చుకెళ్తున్నా అభాగ్యులం......
                                        (పల్లవి) 

చరణం : ఊరూర వెళుతూ, వీధి వీధి తిరుగుతూ

            చెత్తయే మా సొమ్మంటూ 
            దానినే భద్రపరచి, రూపాయి సంపాదించి, 
            ఒక్క పొద్దు భోజంతో,దయగల వాని దుస్తులతో 
            కష్టాలు వారదిగా మార్చి కన్నీళ్లు దాటుకుంటూ 
            కాలాన్ని కదిలిస్తున్న బాల కార్మికులం మేము బాల కార్మికులం........
                                         (పల్లవి) 

చరణం :చల్లని వెన్నెలె తల్లి అంటూ

          రోజు కన్పించే సూర్యుడే తండ్రి అంటూ 
          భుజాన బ్రతుకును యెట్టి 
          ప్రకృతిలో విలవిలాడుతు వున్న పిల్లలం.. పసిపిల్లలం..........
                                          (పల్లవి) 

చరణం :ఏ దేవుడు వినలేదా మా ఘోష

          ఆ ఆకాశం కనలేదా మా రూపం 
          మా కన్నీళ్ళతో తడుస్తున్న ఈ భువికి బాధ అనిపించలేదా 
          లోకానికి ఏకాకులం కావడం  ఎవరి తప్పూ........(పల్లవి) 


                                         ......... G.ANIL KUMAR ...........

above songs written by Anil kumar.He is a great comedian and artist. He is most intelligent. He is studying 2nd year in the prestigious IIIT.He is interested in writing songs and spends considerable amount of time in his favourite hobby might be his ambition in future. నేటి చర్చ :- ప్రతొక్కరికి జన్మ అనేది దేవుడు ఇచ్చిన వరంలాంటిది.అలాంటి బంగారు భవిష్యత్ ను తమ స్వార్ధనికి వుపయోగించి ఒకరిని నాశనం చేస్తూ మరొకరి జీవితాలను వాడుకోవడం చాల పెద్దతప్పూ.ఒక చిన్న విషయం మనము కనిపెంచిన తల్లిదండ్రులను బాగ చూచుకుంటాము అని అమ్మాయిలు ఇంటివద్ద తల్లిదండ్రుల బాగవుంటారు కానీ అదే అమ్మాయిలు అత్తవారింట్లోకి వెళ్ళాగానే అత్తమామలమీద పెత్తనం చెలాయిస్తుంటారు వారితోపాటు వారికొడుకులు కూడ ఇలానే చేస్తూన్నారు.అప్పటిదాక నిరంతరము శ్రమించి అయ్యో నాపిల్లలు అని ఆప్యాయతతో బంగారు గోరుముద్దలు పెట్టిన తల్లిదండ్రులకు తాము అంతిమయాత్ర చేయు సమయములో వారికి తినడానికి పట్టెడు అన్నం పెట్టలేని తోడుగనిలవలేని పిల్లలు నేడు సమాజములో చూస్తూన్నం. ఏదిఏమైన తప్పూ అనేది ఆడు మగల మరియు కనిపెంచిన తల్లిదండ్రుల మీద ఆధారపడి వుంటుంది అనే భావనకు మీరు ఎంతవరుకు స్పందించగలరు.నేను చెప్పినది "చిన్నవిషయం కానీ అది చాల పెద్ద నేరం " please give me your comment.