అక్షాంశ రేఖాంశాలు: 25°37′19.0″N 85°12′25.7″E / 25.621944°N 85.207139°E / 25.621944; 85.207139

మహాత్మా గాంధీ సేతువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మా గాంధీ సేతువు
మహాత్మా గాంధీ సేతువు (ఏరియల్ వ్యూ)
Coordinates25°37′19.0″N 85°12′25.7″E / 25.621944°N 85.207139°E / 25.621944; 85.207139
OS grid reference[2]
Carriesజాతీయ రహదారి 22, జాతీయ రహదారి 31[1]
Crossesగంగానది
Localeపాట్నా - హజీపూర్
Official nameమహాత్మాగాంధీ సేతు
Other name(s)గంగా సేతు
Named forమహాత్మాగాంధీ
Maintained byనేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
Characteristics
Designగిడ్డార్ బ్రిడ్జ్
Materialకాంక్రీటు, స్టీలు
Total length5.75 కి.మీ. (3.57 మై.)
Width25 మీ. (82 అ.)
No. of spans45
History
Designerగామన్ ఇండియా
Constructed byగామన్ ఇండియా లిమిటెడ్
Construction start1972
Construction end1982
Openedమే 1982
Statistics
Tollలేదు (తొలగించబడింది)[2]
Location
పటం

మహాత్మా గాంధీ సేతువు (గాంధీ సెతువు లేదా గంగా సేతువు) గంగానదిపై నిర్మించిన వంతెన. ఇది దక్షిణాన బీహార్ లోని పాట్నా , ఉత్తరాన హజీపూర్ లను కలుపుతుంది. [3] దీని పొడవు 5,750 మీటర్లు (18,860 అడుగులు).[4] ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద వంతెన.[5][6] దీనిని మే 1982న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించింది. ఈ వంతెనకు హజిపూర్ వైపు గల ఉత్తర చివరన ప్రారంభోత్సవం చేసారు. దీనిని వేలాది మంది ప్రజలు సందర్శించారు.

ప్రణాళిక, ప్రాముఖ్యత

[మార్చు]
పాట్నాలో గల గాంధీ సేతువంతెన

ఈ వంతెన నిర్మాణానికి 1969 లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీనిని 1972 నుండి 1982 వరకు 10 సంవత్సరాల పాటు గామన్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ వంతెన నిర్మాణ వ్యయం అప్పటికి రూ.87.22 కోట్లు. ఈ వంతెనను ఉత్తర బీహార్, మిగిలిన బీహార్ ప్రాంతాలను అనుసంధానించడానికి నిర్మించారు. ఇది జాతీయ రహదారి 19లో భాగంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి పూర్వం "రాజేంద్ర సేతువు" ను 1959లో ప్రారంభించబడినది. ఇది ఉత్తర బీహారుకు ఒకే ఒక మార్గం. అప్పటి నుండి "విక్రమశీల సేతువు" ను గంగానదిపై నిర్మించారు. రైలు-రోడ్డు వంతెనలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి. ఇది దిగ్దా, సోనేపూర్, ముంజెర్ లను కలుపుతుంది.[7] [8]

భారతీయ తపాలా వ్యవస్థ ఒక పోస్టల్ స్టాంపును ఈ బ్రిడ్జి చిత్రంతో విడుదల చేసింది. ఈ తపాలా బిళ్లను 2007 ఆగస్టు 17 న 0500 పైసలు విలువతో విడుదల చేసారు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 27 May 2017.
  2. Madhuri Kumar (26 సెప్టెంబరు 2012). "Traffic eases on Gandhi Setu as Centre drops toll collection". Patna: The Times of India. Archived from the original on 30 ఏప్రిల్ 2016. Retrieved 27 మే 2017.
  3. "Destinations :: Patna". Archived from the original on 2014-09-18. Retrieved 2018-05-25.
  4. [1]
  5. "Gandhi Setu: An engineering marvel". Archived from the original on 2012-08-17. Retrieved 2018-05-25.
  6. longest river bridge to be rebuilt Archived 29 అక్టోబరు 2015 at the Wayback Machine business-standard.com
  7. "Digha Sonepur Rail Road Bridge to be operational by 2017". Archived from the original on 6 జూలై 2013. Retrieved 25 మే 2018.
  8. Ganga Rail-Road Bridge
  9. "Welcome to the Indiapost Web Site". Archived from the original on 12 ఏప్రిల్ 2011. Retrieved 25 మే 2018.