మంద జగన్నాథం
మంద జగన్నాథ్ | |||
| |||
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
| |||
పదవీ కాలం 2022-2023 నవంబరు (తెలంగాణ రాష్ట్ర సమితి) | |||
మాజీ ఎం.పి.
| |||
పదవీ కాలం 1999-2008 (తెలుగుదేశం పార్టీ), 2008-2013 (భారత జాతీయ కాంగ్రెస్), 2013-2014 (తెలంగాణ రాష్ట్ర సమితి) | |||
ముందు | మల్లు రవి | ||
---|---|---|---|
తరువాత | నంది ఎల్లయ్య | ||
నియోజకవర్గం | నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951 మే 22 ఇటిక్యాల, నాగర్కర్నూల్ తెలంగాణ | ||
మరణం | 2025 జనవరి 12 హైదరాబాద్ | (వయసు 73)||
రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి , భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సావిత్రి | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కూతురు | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ | ||
మతం | హిందూ |
మందా జగన్నాథం (1951 మే 22 - 2025 జనవరి 12), తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, 11వ, 13వ, 14వ, 15వ పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.[1] ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]మంద జగన్నాథ్ 1951, మే 22న తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లాలోని ఇటిక్యాలలో జన్మించాడు. తండ్రి పేరు పెద్ద పుల్లయ్య. వైద్య విద్యలో ఎం.ఎస్. పూర్తి చేశాడు.
వివాహం
[మార్చు]మంద జగన్నాథ్ కు సావిత్రిలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]మంద జగన్నాథం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996 లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి టీడీపీ పార్టీ విప్ కి విరుద్దంగా ఓటు వేసినందుకు సోమనాథ్ చటర్జీ చేత బహిష్కరణకు గురై అనంతరం 2008, డిసెంబరు 20న జగన్నాథ్ న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతినిధిగా నియమితుడయ్యాడు. మంద జగన్నాథం 2009 ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మంద జగన్నాథం తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి [3] 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు ఆ తరువాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయనను 2022 జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించగా, జూలై 6న ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో బాధ్యతలను స్వీకరించాడు.[4] ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి తనకు కానీ తన కుమారుడికి టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరగా ఇద్దరికి కాకుండా విజేయుడుకు బీ ఫామ్ ఇవ్వడంతో 2023 నవంబరు 17న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూల్ లోక్సభ సీటు ఇవ్వకపోవడంతో రాజస్థాన్ లోని ఆళ్వార్ లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు.[5]
ఎన్నికల జీవితం
[మార్చు]గెలుపు
- 1996 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 48.68% ఓట్లతో గెలిచాడు.
- 1999 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 53.11% ఓట్లతో గెలిచాడు.
- 2004 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 45.89% ఓట్లతో గెలిచాడు.
- 2009 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున 41.23% ఓట్లతో గెలిచాడు.
ఓటమి
- 1998 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 40.26% ఓట్లతో ఓడిపోయాడు.
మరణం
[మార్చు]అనారోగ్యంతో బాధపడుతున్న 73 ఏళ్ళ మందా జగన్నాథం హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2025 జనవరి 12న మరణించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Manda Jagannadham: Latest News, Videos and Photos | Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2016-12-02.
- ↑ "దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం". ETV Bharat News. 2022-07-01. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.
- ↑ నమస్తే తెలంగాణ. "మంచి నడవడికను నేర్పేదే మతం". Retrieved 21 February 2017.[permanent dead link]
- ↑ telugu, NT News (2022-07-06). "రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం బాధ్యతల స్వీకరణ". Namasthe Telangana. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.
- ↑ V6 Velugu (18 April 2024). "ఆళ్వార్ లో బీఎస్పీలో చేరిన మంద జగన్నాథం". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత". 12 January 2025. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1951 జననాలు
- 2025 మరణాలు
- 11వ లోక్సభ సభ్యులు
- 13వ లోక్సభ సభ్యులు
- 14వ లోక్సభ సభ్యులు
- 15వ లోక్సభ సభ్యులు
- నాగర్కర్నూల్ జిల్లా రాజకీయ నాయకులు
- నాగర్కర్నూల్ జిల్లా నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- నాగర్కర్నూల్ జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు