పులపర్తి రామాంజనేయులు
పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు ) ఒక రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు.
ఆయన 2009 నుండి 2014 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున భీమవరం ఎమ్మెల్యేగా పని చేసారు.
తర్వాత తెలుగు దేశం పార్టీ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నియోజక వర్గ శాసన సభ్యులు గా 2014-2019 కాలానికి ఎన్నికయ్యారు. అంతకు మునుపు, ఆయన కాంగ్రెస్ పార్టీలో తరపున భీమవరం ఎమ్మెల్యే (2009-2014) గా పనిచేసారు.[1][2]
2019 లో గ్రంథి శ్రీనివాస్ గారి చేతిలో ఓటమి చెందిన ఆయన తిరిగి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచారు.
అతను బాల్యం నుండి తన 20వ సంవత్సరంలో వివాహం చేసుకున్నంతవరకు ఘనాహారం తీసుకోలేదని, ఆహారంగా పాలు మాత్రమే తీసుకునేవాడినని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.[3]
ఆయనను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) చైర్మన్గా నియమిస్తూ 2025 ఫిబ్రవరి 4న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Ramanjaneyulu Pulaparthi (anji Babu) of TD LEADS the Bhimavaram constituency | Andhra Pradesh Andhra Pradesh Assembly Election 2014 - NewsReporter.in". www.newsreporter.in. Archived from the original on 2018-04-23. Retrieved 2018-04-22.
- ↑ ADR. "Ramanjaneyulu Pulaparthi(TDP):Constituency- BHIMAVARAM(WEST GODAVARI) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2018-04-22.
- ↑ "TDP MLA claims he survived only on milk for 20 years". Hindustan Times/ (in ఇంగ్లీష్). 2017-02-28. Retrieved 2018-04-22.
- ↑ "అసెంబ్లీ ఫైనాన్స్ కమిటీలకు చైర్మన్లు ఖరారు". Andhrajyothy. 5 February 2025. Archived from the original on 5 February 2025. Retrieved 5 February 2025.