పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు
పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు | |
---|---|
జననం | పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు 1890 |
మరణం | 1962 |
ప్రసిద్ధి | కవి |
మతం | హిందూ |
తండ్రి | పెద్దనారాయణప్ప |
తల్లి | నరసమ్మ |
పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు (1890 - 1962) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి. సాహిత్యాభిమానిగా, సమాజ సేవకుడిగా గుర్తింపు పొందాడు.[1]
జననం, కుటుంబం
[మార్చు]పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు 1890లో జన్మించాడు. తండ్రి పిళ్లారిసెట్టి శ్రీకృష్ణులు నాయుడు. ఇతను హిందూ ఆదివెలమ కులానికి చెందినవాడు.[2]
ఉద్యోగం
[మార్చు]రంగబ్రహ్మారావు నాయుడు బళ్ళారిలో తహసీలుదారుగా ఉద్యోగం చేశాడు. ఉద్యోగ రీత్యా బందరు నుండి బళ్ళారికి వచ్చాడు.[2]
సాహిత్యరంగం
[మార్చు]1930లో రంగబ్రహ్మారావు నాయుడు సీస పద్యాలతో 'ఆదివెలమ శతకం' రచించాడు. ఈ శతకంలో, శ్రీ కృష్ణుడు బృందావనంలో జన్మించినట్లుగానే, ఆదివెలమ కులం జన్మస్థలం 'బందరు' అని సూచించాడు. ఈ శతకంలో 173 సీస పద్యాలు ఉన్నాయి.
1931లో బళ్ళారిలో శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల స్థాపించబడినప్పుడు, రంగబ్రహ్మారావు నాయుడు ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ను తన ఇంటికి పిలిపించుకొని, సంస్థ ప్రాముఖ్యతను వివరించారుడు. ఈ ఉద్యమం బళ్ళారి పట్టణానికి ఎంతగానో అవసరమని, పట్టుదలతో కృషి చేస్తే ధన సహాయం తప్పక లభిస్తుందని ప్రోత్సహించాడు. అంతేకాకుండా, స్వయంగా భూరి విరాళం ఇచ్చి గ్రంథమాలను ఆదుకున్నాడు.[2]
మరణం
[మార్చు]రంగబ్రహ్మారావు నాయుడు 1962 ప్రాంతంలో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 2.2 2.3 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).