పవిత్ర గ్రంధములు
(పవిత్ర గ్రంథం నుండి దారిమార్పు చెందింది)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5b/%E0%A4%8B%E0%A4%97%E0%A5%8D%E0%A4%B5%E0%A5%87%E0%A4%A6.jpg/220px-%E0%A4%8B%E0%A4%97%E0%A5%8D%E0%A4%B5%E0%A5%87%E0%A4%A6.jpg)
ప్రపంచము లో చాలా మతములకు, పవిత్ర గ్రంథములు ఉన్నాయి. చాలా మతములు ఆధ్యాత్మిక ఉద్యమములు వారి పవిత్ర గ్రంథములు దైవ సంబంధమైనవని,అత్మ జ్ఞాన సంబంధమైనవని భావిస్తారు.
హిందూమతము లో ఋగ్వేదము ప్రస్తుతం లభ్యమైన ఆధారాల ప్రకారం సుమారుగా క్రీ.పూ 1500-1300 లో కూర్చబడినది అని ఊహించడమైనది (వేదాలు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం కూర్చబడినదని భారతీయుల నమ్మకం. వేదాలని అపౌరుషేయాలని అంటారు అంటే పురుషులెవరూ(మానవులెవరూ) వ్రాయలేదని అర్ధం. వేదాలు మానవ జీవన విధానలను, గమనాలను నిర్దేశిస్తాయి, నిశితంగా పరిశీలిస్తే వేదాల నండి అంతులేని విజ్ఞానాన్ని మనం గ్రహించవఛ్ఛు). అందువలన ఇది అతి ప్రాచీన హైందవ గ్రంథము. [ఆధారం చూపాలి].