జెట్టి తాయమ్మ
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/te/5/5f/%E0%B0%9C%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE.jpg)
జెట్టి తాయమ్మ (1868 - 1957) ప్రఖ్యాత నృత్య కళాకారిణి.[1]
ఈమె తండ్రి దానప్ప మైసూరు సంస్థానంలో ఆస్థాన మల్లయోధుడు. ఈమె ప్రసిద్ధ నాట్యవేత్త సుబ్బరాయప్ప వద్ద నాట్యాన్ని, చంద్రశేఖర శాస్త్రి అనే పండితుని వద్ద తెలువు పదాలను, కరి బసవప్ప వద్ద జావళీలను నేర్చుకున్నారు.
ఈమె శ్రీకృష్ణ కర్ణామృతం, గీత గోవిందం, కాళిదాస నాటకాల నుండి శ్లోకాలను పాడుతూ వాటికి అనుసరణంగా రసవంతంగా అభినయించేవారు. నాట్యంలో "చూర్ణిక" అనే అంశాన్ని ఈమె మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఈమె తన 15వ ఏట మైసూరు సంస్థానంలో ఆస్థాన నర్తకిగా నియమించబడినది.
మైసూరులోని మహారాజా కళాశాలలో 1945లో పండితులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈమెకు "నాట్య సరస్వతి" బిరుదు నిచ్చి గౌరవించారు.
ఈమె 1957 లో పరమపదించారు.
మూలాలు
[మార్చు]- ↑ తాయమ్మ, జెట్టి (1868-1957), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 225-6.