Jump to content

జనవినోదిని

వికీపీడియా నుండి
జనవినోదిని
సంపాదకులువేదము వేంకటరాయశాస్త్రి
ముద్రణకర్తమద్రాసు స్కూల్‌బుక్ సొసైటీ
మొదటి సంచిక1875
ఆఖరి సంచిక1885

19 వ శతాబ్దంలో వచ్చిన తెలుగు మాస పత్రిక జనవినోదిని. పిల్లల కథలు, గేయాలు ప్రచురించిన తొలి పత్రిక ఇది. మద్రాసు స్కూల్‌బుక్ సొసైటీ ఈ పత్రికను ప్రచురించింది. వి. కృష్ణమాచార్యులు సంపాదకత్వంలో ఇది వెలువడింది.[1]

చరిత్ర

[మార్చు]

1875 లో మొదలై 1885 వరకు పదేళ్ళ పాటు ప్రచురితమైన పత్రిక, జనవినోదిని. పిల్లల కథలు, గేయాలు ప్రచురించిన తొలి పత్రికగా దీనికి విశిష్టత ఉంది. "చిట్ల పొట్ల కాయ”, "రుంగు రుంగు బిళ్ళ" వంటి పిల్లల గేయాలను ఈ పత్రిక పచురించింది.[2]

వేదము వేంకటరాయశాస్త్రి దీనికి సంపాదకుడు. ఆయన ప్రతాపరుద్రుని కథను, కథానరిత్సాగరం కొన్ని ప్రకరణములనూ పత్రికలో ప్రచురించాడు.[3] చదలవాడ సీతారామశాస్త్రి రచించిన దక్కన్‌ పాతకథలు వరుసగా ఈ పత్రికలో వచ్చాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 వేదగిరి, రాంబాబు (2012). ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన గ్రంథాలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 21.
  2. వెలగా, వెంకటప్పయ్య (1982). బాల సాహితీ వికాసం. విజయవాడ: సిద్ధార్థ పబ్లిషర్స్. p. 57.
  3. వెంకటరాయశాస్త్రు, వేదము (1949). జీవిత చరిత్ర సంగ్రహము. మద్రాసు: వేదము వేంకటరాయశాస్త్రి అండ్‌ బ్రదర్స్. p. 45.