గూడూరు రాజేంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గూడూరు రాజేంద్రరావు (జననం 1904 సెప్టెంబర్ 25, మరణం 1945 జులై 17). జీవితకాలం 39 సంవత్సరాలు.

రాజేంద్రరావు కొంచం సంపన్న కుటుంబలో జన్మించి, హయిస్కూల్ చదువు తరువాత, మద్రాసులో చదువుకొన్నాడు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఏం.ఏ ఇంగ్షీషు పాసయాడు. రాజేంద్రరావు Sheakespere నాటకాలమీద రాసిన విమర్శ వ్యాసాలను కాలేజీ అధ్యాపకులు మెచ్చుకొన్నారు. ఆరోజుల్లో కాలేజీలో Shakespere English నాటకాలలో నటించాడు, వేదం వెంకరాయశాస్త్రి ప్రతాపరుద్రీయంలో ప్రతాపుని వేషంవేసి, బొబ్బిలి జమీందారు అభినందనలు అందుకొని, ఆ జమీన్.దారు సంస్థానంలో కొంతకాలం ఉద్యోగంచేశాడు. తర్వాత ప్రభుత్వోద్యోగంలో చేరి నెల్లూరు, కడప, పెద్దాపురం మున్సిపల్ కమీషనర్.గా చేసి కర్నూలు మునిసిపల్ incharge కమీషనర్ గా పనిచేస్తున్న సమయంలో రక్తహీనత వ్యాధిబారినపడి, మద్రాసు రాయపేట హాస్పిటల్.లో చికిత్స పొందుతూ అక్కడే కనుమూశాడు. ఆయనకు సంతానం లేరు. భార్య అంత్యక్రియలు జరిపించింది.

రాజేంద్రరావు కొంతకాలం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ఆదివెలమ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు. రాజేంద్రరావు ఇంగ్లీషు, తెలుగు సాహిత్యం బాగా అధ్యయనం చేసిన వాురు. సంస్కరణ భావాలు కలిగినవ్యక్తి. నెల్లూరు జిల్లాలోని ఆదివాసీలు యానాదుల దయనీయమయిన జీవితాలను సానుభూతితో బాగా పరిశీలించి, రచించిన 'చెంచి'కథ 1932 ఆగస్టు భారతి సంచికలో ప్రచురించబడినది. విమర్శకులు రాజేంద్రరావును ఆదివాసీల మీద రాసిన తొలి తెలుగు కథారచయితగా పేర్కొన్నారు. ఈయన మేనల్లుడు పెన్నేపల్లి గోపాలకృష్ణ వివిధ పత్రికలలో ప్రచురించబడిన నాటికలు, వ్యాసాలు, కథలను సేకరించి గూడూరు రాజేంద్రరావు కథలు పేరుతో ఒక పుస్తకం ప్రచురించాడు. ఈయన మరణవార్తను నెల్లూరు పత్రిక జమీన్ రైతు వివరంగా ఇచ్చింది.

మూలాలు

[మార్చు]
  • గూడూరు రాజేంద్రరావు కథలు, సంపాదకుడు: పెన్నేపల్లి గోపాలకృష్ణ, నెల్లూరు, 1976.
  • మరణవార్త : 27-జులై-17 జమీన్ రయతు సంచిక.
  • అంధ్రజ్యోతి దినపత్రిక జనవరి, 2 వ తారీకు, 2024. శ్రీ అల్లరి మోహనారావ్ గారి వ్యాసం
  • శ్రీ విక్రమ సింహాపురి మండల సర్వస్వం, నెల్లూరు జిల్లా రచయితలు, బడిగురవారెడ్డి వ్యాసం.