గిరీష్ భరద్వాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గిరీష్ భరద్వాజ్ (జననం: 1950 మే 2 ) భారతదేశంలోని మారుమూల గ్రామాలలో 127 వంతెనలను నిర్మించినందుకు సేతు బంధు, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఒక భారతీయ సామాజిక కార్యకర్త. 2017లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. [1][2][3][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భరద్వాజ్ 1950 మే 2న కర్ణాటక సుల్లియా లో జన్మించాడు. 1973లో మాండ్య పి. ఇ. ఎస్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు.[1][5] అతని భార్య ఉష. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కెరీర్

[మార్చు]

ఆయన 1989లో దక్షిణ కర్ణాటకలోని అరంబూర్ వద్ద పయస్విని నదిపై తన మొదటి వంతెనను నిర్మించాడు. అప్పటి నుండి, ఆయన కేరళలో సుమారు ముప్పై వంతెనలను, తెలంగాణ, ఒడిశాలో రెండు వంతెనలని నిర్మించాడు, మిగిలిన వంతెనలు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి.[3][6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Sullia's bridge-man gets Padma Shri". The Times of India. Retrieved 11 August 2017.
  2. "President Pranab Mukherjee confers Padma awards". Outlook. Retrieved 11 August 2017.
  3. 3.0 3.1 "Padma Shri award: 'Bridge Man' credits it to his employees". Deccan Chronicle. Retrieved 11 August 2017.
  4. "Invincible Indians: Solid People, Solid Stories". Firstpost. Retrieved 11 August 2017.
  5. "Bridge man Girish Bharadwaj at VVIET". Star of Mysore. Retrieved 11 August 2017.
  6. "Padma award winners from Karnataka are an eclectic mix". The Hindu. Retrieved 11 August 2017.