Jump to content

ఖ్వాజా అహ్మదుద్దీన్

వికీపీడియా నుండి
ఖ్వాజా అహ్మదుద్దీన్
ఖ్వాజా అహ్మదుద్దీన్
జననం1905
వసంతాపురం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
మరణంఅక్టోబరు 20, 1970
తండ్రిషేక్ బాలె సాహెబ్
తల్లిఫఖ్రున్నిసాబేగం

ఖ్వాజా అహ్మదుద్దీన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అహ్మదుద్దీన్ 1905వ సంవత్సరంలో షేక్ బాలె సాహెబ్, ఫఖ్రున్నిసాబేగం దంపతులకు నాగర్‌కర్నూల్ జిల్లాలో వసంతాపురం గ్రామంలో జన్మించాడు. పదకొండేళ్ళ వయసులో అల్లాజీ అవదూత దర్శనం, పన్నెండేళ్ళ వయసులో అల్లాజీ అనుగ్రహం లభించాయి.

రచనా ప్రస్థానం

[మార్చు]

ఈయన రాసిన కృతులు అహ్మదుద్దీన్ ఆత్మతత్త్వములు పేరుతో ఐదు భాగాల గ్రంథంగా మొదటి ప్రచురణ 1952లో, రెండవ ప్రచురణ 1997లో వెలువడింది. ఈ తత్త్వాలన్ని పాడుకునేందుకు వీలుగా ఉండడమేకాకుండా, వినడానికి శ్రావ్యంగా ఉంటాయి. ఉర్దూలో దాదాపు 32 గజల్స్ రాశాడు.[2]

మరణం

[మార్చు]

ఈయన 1970, అక్టోబరు 20న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 4 December 2019.
  2. ఖ్వాజా అహ్మదుద్దీన్, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట.44